ట్రెండింగ్
Epaper    English    தமிழ்

24 గంటల్లో 1430 మంది సైనికులను హతమార్చాం..: రష్యా క్లారిటీ

international |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 07:51 PM

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర పోరు సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. సోమవారం రోజే ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్లతో విరుచుకు పడింది. ముఖ్యంగా స్పైడర్ వెబ్ పేరుతో భారీ ఎత్తున డ్రోన్ దాడులు చేసి.. 7 బిలియన్ల విలువైన 41 విమానాలను ధ్వంసం చేసింది. 18 నెలల కిందటే స్కెచ్ వేసి మరీ తాజాగా ఈ దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. దీని తర్వాత నుంచి రష్యా సైతం ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేసింది. అయితే రాత్రి, పగలనే తేడా లేకుండా తాము చేస్తున్న దాడులతో ఉక్రెయిన్‌కు చెందిన 1430 మంది సైనికులు హతమయ్యారని తాజాగా ప్రకటించింది. ఇదంతా గత 24 గంటల్లో చేసిన దాడుల వల్లేనని కూడా పేర్కొంది.


ఓవైపు ష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం గురించి చర్చలకు సన్నాహాలు సాగుతుండగానే.. మరోవైపు ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సోమవారం రోజే ఉక్రెయిన్ రష్యాపై పెద్ద ఎత్తున డ్రోన్ దాడులకు పాల్పడగా.. ఉక్రెయిన్ సైతం అదే స్థాయిలో ప్రతిదాడులు చేస్తోంది. అయితే గత 24 గంటల్లోనే ఉక్రెయిన్‌పై తమ బలగాలు చేసిన దాడుల్లో 1430 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కీవ్‌లో డ్రోన్లు, క్షిపణులు, సాయుధ పోరాట వాహనాలు, ఫిరంగి తుపాకులను కూడా ధ్వంసం చేశామని చెప్పింది.


 మరోవైపు గత మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో తమ సైన్యం దాదాపు 1 మిలియన్ రష్యన్ సైనికులను హతమార్చిందని ఉక్రెయిన్ ప్రకటించింది. యుద్ధంలో మొత్తంగా 9 లక్షల 90 వేల 800 మంది రష్యా సైనికులు చనిపోయారని.. అందులో 1100 మంది సైనికులు గత 24 గంటల్లోనే ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. అలాగే తాము చేసిన దాడుల వల్ల రష్యాకు చెందిన 10 వేల 881 ట్యాంకులు, 22 వేల 671 సాయుధ పోరాట వాహనాలు, 50 వేల 607 ఇంధన ట్యాంకులు, 28 వేల 623 ఫిరంగి వ్యవస్థలు, 1402 బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థలు, 1176 వైమానికి రక్షణ వ్యవస్థలు, 384 విమానాలు, 41 యుద్ధ విమానాలు, 336 హెలికాప్టర్లు, 38 వేల 748 డ్రోన్లు, 28 నౌకలు, ఒక జలాంతర్గామి నాశనం అయ్యాయని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ తెలిపారు.


సోమవారం రోజే రష్యా, ఉక్రెయిన్ మధ్య తుర్కియేలోని ఇస్తాంబుల్ సిరగాన్ ప్యాలెస్‌లో చర్యలు జరిగాయి. తుర్కియే విదేశాంగ శాఖ మంత్రి హకన్ ఫిదాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. కాల్పుల విరమణ ఒప్పందం గురించి మాట్లాడారు. కానీ బయటకు వచ్చిన తర్వాత దీని గురించి ఎలాంటి విషయమూ వెల్లడించలేదు. దీన్ని బట్టే ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదని అర్థం అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa