ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెనడాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు

international |  Suryaa Desk  | Published : Wed, Jun 04, 2025, 11:30 PM

కెనడాలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి టోరంటో ఉత్తర యార్క్‌లోని లారెన్స్ హైట్స్ ప్రాంతంలో ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. టొరంటో పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నివాస ప్రాంతంలో దుండుగుడు కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు వ్యక్తులు గాయపడినట్టు తెలిపారు. వీరిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించినట్టు పేర్కొన్నారు. రెసిడెన్సియల్ ప్రాంతంలో కాల్పులు జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన నెలకుంది.


ఈ ఘటనపై టొరంటో మేయర్ ఒలివియా చౌ స్పందిస్తూ.. ‘లారెన్స్ హైట్స్ ప్రాంతంలో జరిగిన కాల్పులు ఆందోళనకు గురిచేశాయి.. ప్రస్తుతం ఘటనాస్థలిలో ఉన్న టొరంటో పోలీసులతో మా కార్యాలయం సిబ్బంది టచ్‌లో ఉన్నారు... అలాగే ప్రాదేశిక కౌన్సిలర్, డిప్యూటీ మేయర్ మైక్ కొల్లేతోనూ మాట్లాడానుఈ క్లిష్ట పరిస్థితిలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, టొరంటో పోలీస్, ఫైర్, పారామెడిక్ సేవల‌కు నా కృతజ్ఞతలు. త్వరలో పూర్తి సమాచారం అందించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు’ అని ఆమె చెప్పారు.


ప్రస్తుతం టొరంటో పోలీస్ విభాగంఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టింది. ఈ కాల్పుల వెనుక గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన టొరొంటో నగరంలో భద్రతపై ఆందోళనలు రేకితిస్తోంది. కాల్పుల వెనుక గల ఉద్దేశం, దుండగుల గుర్తింపు కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.


అమెరికాతో పోలిస్తే గన్ కల్చర్ తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో పెరుగుతున్న హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2022లో తుపాకీ సంబంధిత హింసా ఘటనలు 36.7కి పెరిగాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 8.9% పెరుగుదల. కెనడా ప్రభుత్వం 2020లో 1,500 మోడళ్ల అసల్ట్-స్టైల్ తుపాకులను నిషేధించింది.అయితే, అమెరికా నుంచి అక్రమంగా తుపాకులు ప్రవేశించడం వల్ల ఈ చర్యల ప్రభావం తగ్గుతోంది.తుపాకీ హింస కారణంగా ప్రజల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ లిబరల్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా రెండోసారి మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు, తుపాకీ సంబంధిత నేరాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అమెరికా నుంచి అక్రమంగా ఆయుధాలు ప్రవేశించకుండా అడ్డుకోవాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa