ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేనల్లుడితో అఫైర్.. .. ఏం జరిగింది?

Crime |  Suryaa Desk  | Published : Wed, Jun 04, 2025, 11:53 PM

వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మూడు నెలల కిందట ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన అమానుష ఘటనను దేశవాసులు ఇంకా మర్చిపోలేదు. ప్రేమికుడి కోసం తన భర్త మర్చంట్‌ నేనీ ఆఫీసర్‌ సౌరభ్ రాజ్‌పుత్‌ను కిరాతకంగా చంపేసింది ముస్కాన్ రస్తోగి అనే మహిళ. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా కోసి సిమెంట్‌లో కలిపి ఓ ప్లాస్టిక్ డ్రమ్‌లో దాచిపెట్టింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అచ్చం అలాంటి ఘటనే మరొకటి తాజాగా పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ అత్త, అతడిని దారుణంగా హత్య చేసింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి, తన తండ్రి ఇంట్లో సిమెంట్‌తో కప్పి పెట్టింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సద్దాం నదాబ్ అనే యువకుడు లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేసేవాడు. మాల్దా జిల్లాలో తన మేనత్త మౌమిత హసన్ నదాబ్‌ ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. గత నెల (మే) 18న సద్దాం.. మేనత్త ఇంటి నుంచి తన బైక్‌పై తన సొంతూరికి బయలుదేరాడు. ఆ తర్వాత నుంచి కనిపించకుండాపోయాడు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.


పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగించినా ఎలాంటి క్లూ లభించలేదు. ఈ క్రమంలో దినాజ్‌పూర్ జిల్లాలోని తపన్ ప్రాంతంలో ఉన్న ఇంట్లో ఓ మృతదేహం అవశేషాలు లభ్యం అయ్యాయి. ప్లాస్టిక్ కవర్లతో, సిమెంట్‌లో చుట్టి ఉన్న బాడీ పార్ట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మౌమిత హసన్‌ను అరెస్టు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. పోలీసుల విచారణలో మౌమిత తన నేరం అంగీకరించింది. సద్దాంను తానే చంపానని ఒప్పుకుంది.


మృతదేహాన్ని మూడు ముక్కలుగా కోసి సిమెంట్‌లో కలిపి తన తండ్రి ఇంట్లో ఉన్న మెట్ల కింద ఉంచినట్లు మౌమిత అంగీకరించింది. కొన్ని అసభ్యకరమైన ఫొటోలు తీసి, వాటిని చూపించి సద్దాం బ్లాక్‌మెయిల్ చేశాడని, అందుకే చంపేశానని మౌమిత చెప్పింది. మౌమిత, సద్దాం మధ్య వివాహేతర సంబంధం ఉందని, ఆ కారణంగానే హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.


ఈ మర్డర్‌ కేసులో ఆర్థిక కోణం కూడా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సద్దాం వద్ద కొన్ని లక్షల రూపాయల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని చంపి, ఆ నగదును కాజేయాలని మౌమిత, ఆమె భర్త ప్రణాళిక రచించి ఉండవచ్చని భావిస్తున్నారు. మౌమిత భర్తను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


పశ్చిమ్ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలు జిల్లాలో గత నెల ఇలాంటిదే మరొక ఘటన జరిగింది. భరత్‌ నగర్‌లోని బసంతి ప్రాంతంలో ఓ వ్యక్తి తన మరదలు తల నరికి, చేతిలో పట్టుకుని తిరగడం కలకలం సృష్టించింది. దీన్ని చూసి బెంబేలెత్తిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని బిమల్ మోండల్‌గా గుర్తించారు. ఇద్దరి మధ్య తలెత్తిన ఓ గొడవ హత్యకు దారితీసిందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa