సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావును విజయవాడ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా, పులివెందుల పట్టణంలోని జర్నలిస్టులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు.
పాత బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం, పోలీసులకు వినతి పత్రం అందజేసి, మీడియా స్వేచ్ఛను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.
![]() |
![]() |