గుజరాత్లోని అహ్మాదాబాద్లో ఎయిరిండియాకు చెందిన విమానం కూలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఏఐ 171 విమానం అహ్మదాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్కు బయలుదేరింది. మానాశ్రయం నుంచి టెకాఫ్ అయిన 2 నిమిషాలకే అది కూలిపోగా.. ప్రమాద సమయంలో విమానంలో మొత్తంగా 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ విమానం ప్రమాదానికి గురికావడానికి ముందు నిమిషానికి 475 అడుగుల వేగంతో కింద పడిపోయినట్లుగా ఫ్లయిట్ రేడార్ 24 తన రిపోర్టులో వెల్లడించింది. టేకాఫ్ తర్వాత అత్యధికంగా 625 అడుగుల ఎత్తుకు విమానం చేరుకున్నట్లు వివరించింది. అలాగే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు విమానంలో ఉన్న వారంతా చనిపోయినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరో ఐదుగురు విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
విమానంలో 169 మంది భారతీయులు..
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండగా.. అందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్, ఒకరు కెనడాకు చెందిన వారు ఉన్నారు. ఇందులోనే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే వీరంతా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విమానం వేగంగా కింద పడగా.. అందులో ఉన్న ప్రతీ ఒక్కరూ చనిపోయారని అధికారులు భావిస్తున్నారు. అధికారికంగా ఈ విషయం వెల్లడించకపోయినప్పటికీ.. ఇదే నిజమని తెలుస్తోంది. మరోవైపు విమానం జనావాసాల్లో పడింది. ముఖ్యంగా ఇందులోని కొన్ని భాగాలు అక్కడే ఉ్న బీజే మెడికల్ కాలేజీ యూజీ హాస్టల్ భవనాలపై పడ్డాయి. ఫలితంగా ఓచోట పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఐదుగురు విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అధికారులే నేరుగా వెల్లడించారు.
ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. ప్రమాదంలో గాయపడిన వారు సహా మృతదేహాలను క్షేమంగా బయటకు తీస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ ప్రమాదం ఎలా సంభవించిందో తెలుసుకునేందుకు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు. ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్ విమానం కూలిన ఘటనకు సంబంధించిన రేడార్ డేటాను.. ఫ్లయిట్ రేడార్ 24 ఇప్పటికే విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా విహరించే విమానాలకు సంబంధించిన డేటాను ఫ్లయిట్ రేడార్ 24 ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుండగా.. విమాన రాకపోకలకు సంబంధించిన పూర్తి డేటా దీని వద్ద ఉంటుంది. అయితే తాజాగా అహ్మదాబాద్లో విమానం కూలిపోగా.. అందుకు సంబంధించిన డేటాను అప్డేట్ చేసింది.
ఏడీఎస్-ఒ, ఎంఎల్ఏటీ, శాటిలైట్, రేడార్ ఆధారంగా డేటాను తీసుకున్న ఫ్లయిట్ రేడార్ 24.. చివరి సారిగా విమానం 625 అడుగుల ఎత్తుకు వెళ్లినట్లు చెప్పింది. అలాగే టేకాఫ్ తీసుకున్న నిమిషం లోపే ఏటీసీతో విమాన సంబంధాలు తెగిపోయినట్లు వెల్లడించింది. 08:08 యూటీసీ, స్థానికంగా 13.38 గంటలకు ప్రమాదం జరిగినట్లు వివరించింది. అలాగే విమానం నిమిషానికి మైనస్ 475 అడుగులు వేగం (వర్టికల్ స్పీడు)తో నేలకూలినట్లు ఫ్లయిట్ రేడార్ 24 తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa