ప్రమాదాల్లో కాళ్లు కోల్పోయిన వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సరికొత్త ప్రయత్నం చేస్తోంది రోటరీ క్లబ్. తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగులు కాళ్లు లేకపోవడంతో సాయం కోసం ఎదురు చూస్తుంటారు. చేతి కర్రల సాయంతో నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. కృత్రిమ కాళ్లు ఉన్నా రోజువారీ పనులు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి రోటరీ క్లబ్లు ముందుకు వచ్చాయి. మంగళగిరి, జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్లు కలిసి 'శ్రీ పాదం' ప్రాజెక్టును గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రారంభించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా కృత్రిమ కాళ్లను రెండు తెలుగు రాష్ట్రాలలోని 130 మంది దివ్యాంగులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. తక్కువ బరువు, మెరుగైన పనితీరు కలిగిన ఈ కృత్రిమ కాళ్లను మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా అందజేశారు.
గుజరాత్కు చెందిన షా కేఎల్ డఫ్ అండ్ డంబ్ ట్రస్ట్ ప్రభ ఫుట్ను తయారు చేస్తోంది. వీటిని మోకాలి మెకానిజంతో తయారు చేస్తున్నాు. ఈ ఫుట్ల తయారీపై దివ్యాంగులకు ఉచిత శిక్షణ ఇచ్చి.. వారికి ఉపాధి కల్పిస్తున్నారు. దివ్యాంగులకు అందిస్తున్న ఈ కృత్రిమ కాళ్లను రెండు కేజీల బరువుతో పాలీప్రొపైలిన్ అనే మెటీరియల్తో తయారు చేస్తారు. ఇది తక్కువ బరువుతో చాలా గట్టిగా ఉంటుంది. ఈ ఫుట్కు సంబంధించి కీళ్ల భాగాలకు స్టీల్, పాదం భాగంలో పాలీయూరిథేన్ ఫోమ్తో తయారు చేస్తున్నారు. ఈ ఫుట్ పట్టి ఉంచేందుకు బెల్టులు, మెత్తని లైనర్లు ఉంటాయి.
ఈ కాళ్లు నడవడానికి సౌకర్యంగా ఉంటుంది.. దివ్యాంగులు కాళ్లు మడుచుకుని కూర్చోవచ్చని చెబుతున్నారు. సైకిల్ తొక్కడంతో పాటుగా మెట్లు కూడా ఈజీగా ఎక్కేయొచ్చంటున్నారు. అయితే వీటిలో మోకాలి కిందికి బిగించే కాలు ధర రూ.6,300 కాగా.. మోకాలి పైకి అమర్చే కాలు ధర రూ.13,600. అదే ఎలక్ట్రానిక్ సెన్సార్లతో పనిచేసే కృత్రిమ కాలి ధర రూ.3 లక్షల నుంచి రూ.12 లక్షలు.. జైపూర్ లెగ్లు దొరకుతున్నా వాటి బరువు ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంత ఖర్చు భరించే స్థోమత పేదవారికి ఉండదు. అందుకే మంగళగిరి, జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ 'శ్రీపాదం' పేరుతో 130 మందికి ఉచితంగా కృత్రిమ కాళ్లను పంపిణీ చేస్తున్నారు.
మంగళగిరిలో శ్రీపాదం పేరుతో అందిస్తున్న ఈ ఫుట్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు క్యాంప్ నిర్వహించారు. దివ్యాంగుల నుంచి కొలతలు తీసుకున్నారు.. అనంతరం ఆ కొలతల్ని బట్టి గుజరాత్ నుంచి వచ్చిన 15 మంది నిపుణులు కాళ్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ కాళ్లు అమర్చడంతో పాటుగా వారు ఎలా నడవాలో కూడా శిక్షణ ఇస్తారు. అంతేకాదు వీరికి భోజనం కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా 'ప్రభ ఫుట్'ను ఉచితంగా పంపిణీ చేయడం విశేషం. అంతేకాతు 2023, 224లో కూడా మంగళకరం పేరుతో 727మందికి ఉచితంగా కృత్రిమ చేతులు అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa