ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసియాలోనే తొలిసారి ,,,విశాపట్నంలో డబుల్‌ డెక్కర్‌‌ ఫ్లైఓవర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 06:55 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు లైన్ క్లియర్ చేసే పనిలో ఉంది. డీపీఆర్‌తో పాటుగా నిధులు సేకరించే పనిలో ఉంది. ఆసియా మౌలిక వసతుల, పెట్టుబడుల బ్యాంకు రుణం ఇవ్వడానికి ఆసక్తిగా ఉంది. అయితే డబుల్‌ డెక్కర్ తరహాలో నడిపేలా ఈ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారు. ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా  కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. మెట్రో రైలు మార్గానికి, పైవంతెనలకు కలిపి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయడానికి కన్సల్టెంట్‌ను నియమించనున్నారు.. దరఖాస్తుల్ని ఆహ్వానించారు.


విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఎన్‌హెచ్‌ఏఐ గతంలో 12 ఫ్లై ఓవర్లను నిర్మించాలని భావించారు. మధురవాడ నుంచి లంకెలపాలెం వరకు వీటిని నిర్మించడానికి డీపీఆర్ కూడా తయారు చేశారు. అయితే మెట్రో రైలు, ఫ్లై ఓవర్లు వస్తే రెండు పనులతో ఇబ్బందులు తప్పవు.. ఖర్చు కూడా పెరుగుతుంది. అందుకే రెండు ప్రాజెక్టులను కలిపి చేస్తే స్థలం, ఖర్చు ఆదా అవుతుందని భావించారు.. అందుకే డబుల్ డెక్కర్ ప్లాన్ చేస్తున్నారు. నాగ్‌పూర్‌లో డబుల్ డెక్కర్ తరహా మెట్రో ఉండటంతో ఆ ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేసిన సంస్థ నుంచి వివరాలు తెప్పించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు అందజేశారు. ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్, NHAI ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును భరిస్తాయి.. ఈ ప్రాజెక్టును మెట్రో సంస్థ పర్యవేక్షిస్తుంది.


ఏపీ సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో మార్పు.. రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్


విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టును మొత్తం 140.13 కి.మీ.లలో చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశలో మూడు కారిడార్లలో 46.23 కి.మీ ఉంటే.. అందులో 20.16 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ తరహాలో ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. 'మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం, గాజువాక నుంచి స్టీల్‌ప్లాంట్ వరకు రెండు పెద్ద ఫ్లై ఓవర్లు.. వాటిలో కింద రోడ్డు, దానిపై ఫ్లైఓవర్, ఆపైన మెట్రో ట్రాక్ ఉంటుంది. ఈ డబుల్ డెక్కర్ అందుబాటులోకి వస్తే ఆసియా ఖండంలోనే పొడవైన మెట్రో డబుల్ డెక్కర్‌గా పేరు వస్తుంది' అంటున్నారు అధికారులు. అంతేకాదు కొమ్మాది-స్టీల్‌ప్లాంటు మధ్య మెట్రో ప్రాజెక్టులో 34.40 కి.మీ. కారిడార్‌లో డబుల్ డెక్కర్ ట్రాక్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డితో కలిసి AIIB ప్రతినిధులు పర్యటించారు. మెట్రో ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు AIIB ఆసక్తి చూపుతోంది. అందుకే డబుల్ డెక్కర్ తరహాలో డీపీఆర్‌ తయారీకి సిద్ధమైంది.. అందుకే కన్సల్టెంట్‌ నియామకానికి ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్‌ దరఖాస్తుల్ని ఆహ్వానించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa