ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దాడులు నేపథ్యంలో రహస్య ప్రాంతానికి ఇరాన్ సుప్రీం లీడర్

international |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 03:45 PM

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అధికారులు అత్యంత రహస్యంగా ఒక సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్‌లోని అనేక కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయని సమాచారం.గత శుక్రవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఖమేనీ నివాసం ఉన్న ప్రాంతంతో పాటు, ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మోనిరియే ప్రాంతం కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఖమేనీ నివాసానికి అతి సమీపంలో ఈ పేలుళ్లు సంభవించాయని టెహ్రాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన భద్రతపై ఆందోళన చెందిన అధికారులు, ఖమేనీని, ఆయన కుటుంబాన్ని ఈశాన్య టెహ్రాన్‌లోని లావిజాన్‌లో ఉన్న ఒక అండర్‌గ్రౌండ్ బంకర్‌కు తరలించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఖమేనీ కుటుంబాన్ని బంకర్‌కు తరలించిన సందర్భాలున్నాయని పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa