మైదుకూరు పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రఘురామిరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా స్తంభించాయని, ప్రజలు కనీస సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. వైసీపీ కార్యకర్తలు ఈ విషయాలను ప్రజలకు వివరించి, వారి నమ్మకాన్ని చూరగొనాలని సూచించారు.
2029 ఎన్నికల్లో వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలని రఘురామిరెడ్డి ఆదేశించారు. పార్టీ బలోపేతం కోసం గ్రామ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి, ప్రజలతో మమేకమై పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు సన్నద్ధమవుతామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa