ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ మండిపడ్డారు. కుప్పంలో పచ్చ మాఫియా దౌర్జన్యానికి అంతు లేకుండా పోయిందని, అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కుప్పం మండలం నారాయణపురంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడిరోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురి చేసిన ఘటనను భరత్ తీవ్రంగా ఖండించారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన సీఎం ఇలాకాలో చోటు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa