ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండిగో ట్రైనీ పైలట్‌ కి అవమానం, తక్కువ జాతివాడంటూ సహోద్యోగులు హేళన

national |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 04:30 PM

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో పనిచేస్తున్న ఒక ట్రైనీ పైలట్‌ను సహోద్యోగులు కులం పేరుతో దూషించి, తీవ్రంగా అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు అశోక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు.ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ట్రైనీ పైలట్‌గా పనిచేస్తున్న అశోక్ కుమార్‌ను ఆయన సహోద్యోగులైన తపస్ డే, మనీశ్ సహానీ, రాహుల్ పాటిల్ కులం పేరుతో దూషించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనను ‘చమార్’, ‘భంగీ’ వంటి నిమ్న పదజాలంతో దూషించారని, ‘నువ్వు విమానం నడపడానికి అనర్హుడివి, కాక్‌పిట్‌లో కూర్చోవడానికి కూడా నీకు అర్హత లేదు’ అని అవమానించారని అశోక్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.అంతటితో ఆగకుండా ‘వెళ్లి చెప్పులు కుట్టుకోపో, నీ కులవృత్తి అదే కదా’ అంటూ తనను తీవ్రంగా అవమానించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా బూట్లు నాకడానికి కూడా నువ్వు పనికిరావు’ అంటూ ఇతరుల ముందే తనను కించపరిచారని కుమార్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు తనను మానసికంగా తీవ్రంగా గాయపరిచాయని ఆయన వాపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa