ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు జగన్ అధ్యక్షతన వైసీపీ పార్టీ విస్తృతస్థాయి సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 12:27 PM

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉద‌యం.10.30 గంట‌ల‌కు జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు పాల్గొంటారు. టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం.. ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వం సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌ హామీలు  ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండ గట్టాలని  వైయస్ఆర్‌సీపీ భావిస్తోంది. ఆ దిశగా పార్టీ నేతలు, నాయకులకు సమావేశంలో అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa