రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏడాది పాలనంతా దోపిడి, అబద్ధాల మయం అని, ప్రజలకు మిగిలింది వంచన, మోసం మాత్రమే అని వైయస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎప్పుడూ చెప్పేవి గొప్పలు కాగా, చేసేది అప్పులు మాత్రమే అని, అదే పనిగా ఈవెంట్ల నిర్వహణ. ఆర్భాటంగా ప్రచారం తప్ప, ఈ ప్రభుత్వం ఈ ఏడాదిలో ఒరగబెట్టిందేమీ లేదని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని స్పష్టం చేశారు.అయన మాట్లాడుతూ.... కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ, జనసేన, టీడీపీ కలిసి సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుంచి అభివృద్ధి దిశగా అంటూ సచివాలయం వద్ద ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఏడాది కాలంగా ప్రజలకు ఏం మంచి చేశారో వివరిస్తారనుకుంటే ఎన్నికలకు ముందు చెప్పిన అబద్ధాలనే మళ్లీ చెప్పుకొచ్చారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్.. ముగ్గురూ కలిసి ‘ఆత్మస్తుతి. పరనింద’తో పాటు, పరస్పర డబ్బాతో గడిపేశారు. దీనికి కోట్ల రూపాయల ప్రజాధనం నీళ్లలా ఖర్చు చేశారు. కనీసం ఒక్క సంక్షేమ పథకం అందించకుండా ఏడాదిలోనే రూ.1.61 లక్షల కోట్లకుపైగా అప్పులు చేస్తూ గుడ్ గవర్నెన్స్ అందించామని అలవోకగా పచ్చి అబద్ధాలు చెప్పారు. మరోవైపు వారు ప్రచురించిన 30 పేజీల డాక్యుమెంట్లో వైయస్ జగన్ పాలనలో అప్పులపైనా అబద్ధాలు ప్రచురించారు. ఒక్క హమీని కూడా పూర్తిగా అమలు చేయకుండానే సంక్షేమ పథకాలు అమలు చేశామని, అభివృద్ధి సాధించేశామని డాక్యుమెంట్లో ప్రకటించుకున్నారు. ఇంతకన్నా పచ్చి దగా మరొకటి ఉండదు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa