ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 12:29 PM

ఏపీఎండీసీ ఖనిజ సంపదతో పాటు రాష్ట్ర ఖజానాను కూడా తాకట్టు పెట్టి తాజాగా రూ.5,500 కోట్లు బాండ్ల రూపంలో రుణాలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...... ఈ రుణాల సేకరణలో ఏకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 203, 204, 293/1లను ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారాలను ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలపడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. న్యాయస్థానాల్లో దీనిపై వ్యాజ్యం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం బరితెగించి తప్పుడు విధానాలకు సిద్దమైందని ధ్వజమెత్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa