కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంగా రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్షసాధింపుల కోసం వ్యవస్థలను నిర్వీర్యం చేసి, శాంతిభద్రతలు అనే మాటకు అర్థమే లేకుండా చేశారని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేని దారుణమైన పరిస్థితిని తొలిసారి ప్రజలు చూస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిని గుడ్ గవర్నెన్స్ అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు పాలనలో ప్రజల కోసం ఏడాదిలో చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా అంటే టార్చిలైట్ పెట్టి వెతికినా కనపడదు. రాష్ట్రంలో పేరుకే మహిళా హోంమంత్రి. కానీ పోలీస్ వ్యవస్థ మొత్తం లోకేష్ చెప్పు చేతల్లోనే ఉంటుంది. సాక్షాత్తు హోంమంత్రి అనిత తన వద్ద లాఠీ లేదు, భుజాన తుపాకీ లేదని, తాను ఏం చేయలేనంటూ తన నిస్సహాయతను అంగీకరించింది. దీనిని బట్టి చూస్తే వైయస్ జగన్ని తిట్టడానికి మాత్రమే ఆమెకు మంత్రి పదవి ఇచ్చారనిపిస్తుంటుంది. రాష్ట్రంలో వరుసగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాల్సిందిపోయి, వైయస్ జగన్ మీద బురద జల్లడానికి స్క్రిప్టుతో ఆమె సిద్ధంగా ఉంటుంది. ఆమెకే మనస్సాక్షి లేకుండా వైయస్ జగన్కి మనస్సాక్షి ఉందా అని మాట్లాడుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మహిళలపై ఇన్ని ఘోరాలు జరగడం ఇదే తొలిసారి. మహిళలకు రక్షణ కల్పించాలని వైయస్ జగన్ దిశ యాప్ను రూపొందించి అమలు చేస్తే, కూటమి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసింది. దిశ యాప్ను సరిగ్గా అమలు చేసి ఉంటే అనంతపురంలో 14 ఏళ్ల బాలిక మీద 18 మంది రెండేళ్లుగా అత్యాచారం చేసేవారా? ఇదే అనంతపురంలో ప్రేమోన్మాది అకృత్యానికి తన్మయ్ అనే బాలిక బలయ్యేదా? శ్రీకాకుళం నుంచి కడప వరకు చిన్నారుల మీద దాడులు జరుగుతుంటే ఒక్కదాని మీదనైనా వేగంగా స్పందించి నిందితులను శిక్షించిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa