గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కీలకమైన చర్యలు ప్రారంభమయ్యాయి. గురువారం మున్సిపల్ కౌన్సిలర్ గద్దల రూతమ్మ ఆధ్వర్యంలో స్పాట్ డెలివరీ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చెట్నేపల్లిలో పౌరులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను గుర్తించి వెంటనే స్పందించినట్టు తెలిపారు. త్వరలోనే స్పాట్ డెలివరీ బ్యాంక్ను కూడా ఏర్పాటు చేసి ప్రజలకు శుద్ధమైన తాగునీటిని సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ పట్టణ అధ్యక్షుడు గద్దల నాగేంద్ర, వీరాంజి, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల మౌలిక అవసరాలను తీర్చే దిశగా చేపడుతున్న ఈ చర్య ప్రజల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa