పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘దిశ’ సమవేశంలో పలు కీలక అభివృద్ధి అంశాలు చర్చకు వచ్చాయి. జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మహిళల భద్రత, నేర నిరోధక చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఈ సమావేశంలో, వివిధ శాఖల సమన్వయంతో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు.
ఈ సమావేశంలో ఎంపీ బీ.కే. పార్థసారథితో పాటు, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సమస్యలు, పోలీస్ విభాగం స్పందన, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై విస్తృత చర్చ జరిగింది. ప్రజలలో భద్రతాభావం కలిగించేందుకు దిశ పథకం అవసరాన్ని నేతలు హైలైట్ చేశారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయడం, మహిళలకు ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై నాయకులు చర్చించారు. ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పని చేయాలని సమవేశంలో నిర్ణయం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa