మరూర్ టోల్ ప్లాజా సమీపంలో శుక్రవారం వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ఎల్ ఈరలక్కప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు నరసింహ మూర్తి, బూత్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ గౌడ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు.
సజ్జల రామకృష్ణరెడ్డి, మిథున్ రెడ్డిలు మడకశిర నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించిన వ్యూహాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, ప్రజలతో మమేకమై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని వారు ఉద్బోధించారు.
ఈ సమావేశం వైసీపీ నాయకులకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని, పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని సమన్వయకర్త ఎస్ఎల్ ఈరలక్కప్ప తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామీణ స్థాయిలో కార్యక్రమాలను మరింత ఊపందుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa