ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియామకాల జాప్యంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యారంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో భాగంగా కమిషనర్ విజయరామరాజు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నియామకాలు చేపట్టేందుకు వీలుగా తగిన మార్గదర్శకాలతో గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ, విద్యాశాఖ అధికారులు ఆ ఉత్తర్వులను అమలు చేయలేదు. దీంతో సంబంధిత పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ వైఖరిని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించాయి.విద్యాశాఖ అధికారులు కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, విద్యాశాఖ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలులో జాప్యానికి గల కారణాలను వివరించాలని కమిషనర్ను ఆదేశించింది.ఈ నేపథ్యంలో, జులై 11వ తేదీన వ్యక్తిగతంగా కోర్టు విచారణకు హాజరు కావాలని కమిషనర్ విజయరామరాజుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa