ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాబ్ ఇప్పిస్తానని అత్యాచారం.. 'పద్మశ్రీ' గ్రహీతపై సంచలన ఆరోపణలు

national |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 09:23 PM

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ఓ 24 ఏళ్ల న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. లా కాలేజీలోనే ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానిక ఒడిగట్టారు. ఈ దారుణానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన మరువకముందే బెంగాల్‌లో మరో సంచలన ఘటన జరిగింది. ఓ మహిళ.. పద్మశ్రీ గ్రహీతపై అత్యాచార అరోపణలు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని తనపై అఘాయిత్యానికి ఒడిగట్టారని పేర్కొంది. ఇప్పుడీ విషయం పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర దుమారం రేపింది.


పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక మహిళ.. ప్రముఖ సన్యాసి, ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు అందుకున్న స్వామి ప్రదీప్తానంద (కార్తీక్ మహారాజ్)పై అత్యాతారం ఆరోపణలు చేసింది. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. భారత్ సేవాశ్రమ్ సంఘానికి అనుబంధంగా ఉన్న బెల్దంగా యూనిట్‌లో కార్తీక్ మహరాజ్ కార్యదర్శిగా ఉన్నారు. అయితే, అదే ఆశ్రమానికి చెందిన ఆదివాసి అబాసిక్ బాలికా విద్యాలయంలో.. ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి.. 2013 జనవరలో తనపై పలుమార్లు కార్తీక్ మహరాజ్ అత్యాచారం చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.


"పాఠశాల హాస్టల్‌లోనే నాకు వసతి కల్పించి, ఐదో అంతస్తులోని ఒక గదిలో దాదాపు ప్రతిరోజు లైంగిక దాడికి పాల్పడేవారు. అయితే ఆ తర్వాత కూడా ఓసారి ఆశ్రమానికి పిలిపించి.. ఐదు రోజులు ఉండమన్నారు . ఆపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్లమని, నెల నెల డబ్బులు పంపిస్తానని కార్తీక్ మహరాజ్ చెప్పారు" అని బాధితురాలు ఆరోపించింది. కాగా, వీరిద్దరికి 2012లో పరిచయం ఏర్పడినట్లు సమాచారం.


బలవంతంగా గర్భస్రావం


2013లో తాను గర్భం దాల్చినప్పుడు.. మహారాజ్, ఆశ్రమంలోని సిబ్బంది కలిసి బెర్హంపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి బలవంతంగా గర్భస్రావం చేయించారని బాధితురాలు ఫిర్యాదులో చెప్పింది. తాను అభ్యంతరం చెప్పినా బెదిరించి ఈ పని చేయించారని బాధితురాలు ఆరోపించింది.


"ఉద్యోగం వస్తుందనే ఆశతో నేను చాలా కాలం వేచి చూశాను. ఈ క్రమంలో ముర్షిదాబాద్‌లోని వివిధ ఆశ్రమ బ్రాంచ్‌ల్లో కూడా తనపై లైంగిక దాడులు జరిగాయి. దీని కారణంగా నేను మానసికంగా కుంగిపోయాను. ఈ నేపథ్యంలో జూన్ 12న నేను కార్తీక మహరాజ్‌ను కలిశాను. జూ 13న బర్హంపుర్‌లోని ఓ ప్రాంతంలోని నన్న వెయిట్ చేయాలని, ఇద్దరు వ్యక్తులు తనను తీసుకెళ్లడానికి వస్తారని చెప్పారు. అనంతరం నేను.. వారు తెచ్చిన వాహనంలో కూర్చున్నాక.. నన్ను దుర్భాషలాడారు. కార్తీక్ మహారాజ్‌తో మరోసారి కంటాక్ట్ కాకూడదని హెచ్చరించారు. అనంతరం వాహనంలోంచి నన్ను తోసేశారు." అని వివరించింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.


ఆరోపణలను ఖండించిన కార్తీక్


స్వామి ప్రదీప్తానంద ఈ ఆరోపణలను ఖండించారు. తన పేరు, ప్రతిష్టలను దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్ర ఇదని ఆయన అన్నారు. ఆశ్రమంలో పనిచేస్తున్న మహిళా సిబ్బంది, శిష్యురాళ్లను అడిగితే నిజం తెలుస్తుందని, తమ ఆశ్రమంలో మహిళలను గౌరవిస్తారని ఆయన తెలిపారు.


బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా, నాబాగ్రామ్ పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ఆర్జీ కర్ అత్యాచార కేసు, న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం నేపథ్యంలో ఈ ఘటన.. రాష్ట్రంలో సంచలన సృష్టిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa