ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి నేతలు మర్చిపోయారని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి అధ్యక్షతన సోమవారం పార్టీ జిల్లా కార్యాలయ ఆవరణలో ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ పోస్టర్ను ఆవిష్కరించారు. పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు ఘ్యూరిటీ..మోసం గ్యారెంటీ అనే సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టోను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేస్తామన్నారు. కూటమి సర్కారు చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు ఐదు వారాల పాటు ప్రచార కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఎన్నికల హామీల ద్వారా ప్రజలు పొందాల్సిన లబ్ధి ఇతర విషయాలు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశం, క్షేత్రస్థాయిలో నిర్వహణ తదితర అంశాలపై భూమన కరుణాకర్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకులు రాజశేఖర్రెడ్డి , పార్టీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa