ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్రలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారి భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది

national |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 05:51 PM

మహారాష్ట్రలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారి భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. పుణె జిల్లాలో నడిరోడ్డుపై కారు ఆపిన కొద్దిసేపటికే దుండగులు దోపిడీకి పాల్పడి, ఓ బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు తెలిపిన‌ సమాచారం ప్రకారం పుణె జిల్లాలోని భిగ్వాన్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 4:15 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. ఓ కారులో ముగ్గురు మహిళలు, ఓ బాలిక ప్రయాణిస్తుండగా, డ్రైవర్ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వాహనాన్ని హైవే పక్కన నిలిపారు.డ్రైవర్ కారు నుంచి దిగి వెళ్లిన వెంటనే, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. వారు నేరుగా కారు వద్దకు వచ్చి, లోపల ఉన్న మహిళలను పదునైన ఆయుధాలతో భయపెట్టారు. వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కున్నారు.నగలు దోచుకున్న తర్వాత దుండగుల్లో ఒకడు మరింత కిరాతకంగా ప్రవర్తించాడు. కారులోనే ఉన్న 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అకస్మాత్తు పరిణామంతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.ఈ దారుణ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఠాణే  ఎస్పీ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ "ఈ ఘటనపై కేసు నమోదు చేశాం. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాం" అని మీడియాకు వెల్లడించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa