ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందూ మహిళపై రాజకీయ నేత అత్యాచారం.. బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా భారీ నిరసనలు

international |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 11:00 PM

బంగ్లాదేశ్‌లోని ఓ హిందూ మహిళపై జరిగిన అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. బాధితురాలిపై రాజకీయ నేత అత్యాచారానికి పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాజధాని ధాకాలో విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. కుమిల్లా జిల్లాలో మురాద్‌నగర్‌లో జూన్ 26న రాత్రి మహిళ ఇంట్లోకి 36 ఏళ్ల ఫాజోర్ అలీ అనే స్థానిక రాజకీయ నాయకుడు ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లోకి దూరి.. అతి క్రూరంగా ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టడం వీడియోలో కనిపించింది. ఆమె తనను వదలేయమని వేడుకున్నప్పటికీ మృగాడు కనికరించలేదు యూనస్ నాయకత్వంలోని. బంగ్లాాదేశ్‌లో మైనార్టీల దుస్థితికి ఈ ఘటన అద్దం పడుతుంది


రాశిఫలాలు 30 జూన్ 2025:ఈరోజు గ్రహణ యోగం వేళ తులా సహా ఈ 3 రాశులకు తీవ్రమైన సమస్యలు.. తస్మాత్ జాగ్రత్త!


ఈ వీడియో జూన్ 29న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అత్యాచారం కేసు నమోదుచేసి.. ప్రధాన నిందితుడు ఫాజోర్ అలీని ధాకాలోని సయ్యదాబాద్ ప్రాంతంలో అర్ధరాత్రి అరెస్టు చేశారు. బాధితురాలి వివరాలను వెల్లడించిన మరో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు. వీడియో వైరల్ అయిన తరువాతే విచారణ మొదలైనట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ధాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు.


జగన్నాథ్ హాల్ (హిందూ విద్యార్థులకు చెందిన హాస్టల్) విద్యార్థులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ప్రధాన కార్యదర్శి మిర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలం‌గీర్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి, నిందితుడ్ని అత్యంత కఠినంగా శిక్షించాలని కోరారు. అత్యాచార వీడియోను సోషల్ మీడియా నుంచి తక్షణమే తొలగించాలని ఢాకా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, బాధితురాలికి భద్రత కల్పించాలని, వైద్య చికిత్స అందించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు.


గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం 2024 ఆగస్టులో కూలిపోయింది. ఆ తరువాత హిందువులపై హింసాత్మక దాడులు పెరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనూస్ నాయకత్వంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఉగ్రవాదులతో చేతులు కలిపిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హసీనా కుమారుడు సజీబ్ వాజేడ్ అత్యాచార ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గత 11 నెలల్లో మతపరమైన అల్లర్లకు, ముఠాల హింసకు, అత్యాచారాలకు మహ్మద్ యూనూస్ పాలన దోహదపడింది’ అని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో ఆరోపించారు. మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని, రాజకీయ ప్రత్యర్థులపై లక్షిత దాడులకు మద్దతు ఇస్తున్నారనే అపవాదు యూనస్‌పై ఉంది. ఈ విషయంలో ఆయన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa