ధర్మవరం మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు సంబంధించిన రిలే నిరాహార దీక్షలు బుధవారం ఏడో రోజుకు చేరుకున్నాయి. వారు మోకాళ్ళ మీద కూర్చుని శాంతియుతంగా నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి తమ ఆకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ జాయింట్ సెక్రటరీ బాబు మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యలపై చర్చలు ప్రారంభించి, వేతనాలు పెంచాలని” ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్మికుల సేవలను గుర్తించి, వారిని న్యాయంగా గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అలాగే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం "సమాన పనికి సమాన వేతనం" విధానాన్ని అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరగనున్నదని వారు అభిప్రాయపడ్డారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa