కర్ణాటక రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నాయకత్వ మార్పు అంశానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా తెరదించారు. ఐదేళ్ల పూర్తి కాలం తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన బుధవారం స్పష్టంగా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమంటూ సాగుతున్న ప్రచారానికి ఫుల్స్టాప్ పడినట్లయింది.బుధవారం మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి మార్పు గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. "ఐదేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను. ఈ విషయంలో మీకెందుకు అనుమానాలు వస్తున్నాయి?" అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని మారుస్తారంటూ బీజేపీ, జేడీఎస్ వంటి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. "వారు కాంగ్రెస్ అధిష్ఠానమా? మా పార్టీ అంతర్గత విషయాల గురించి మాట్లాడటానికి వాళ్లెవరు?" అని ఆయన కొట్టిపారేశారు.ఈ పరిణామాలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా స్పందించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. "ఆయనకు అండగా నిలవడం తప్ప నాకు మరో దారి లేదు. నేను ఆయనకు మద్దతు ఇవ్వాలి. పార్టీ అధిష్ఠానం ఏది చెబితే అది చేయడమే నా కర్తవ్యం" అని శివకుమార్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa