ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెళగావిలో ప్రేమ జంట ఆత్మహత్య.. ఆటోలో విషాద ఘటన

national |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 01:04 PM

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రాఘవేంద్ర జాదవ్ (28), రంజిత (26) అనే ప్రేమ జంట ఆటో రిక్షాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. గోకాక్ తాలూకులోని చిక్కనంది గ్రామంలో జులై 1, 2025న ఈ ఘటన జరిగింది. ఊరి బయట ఆటోలో వీరు విగతజీవులై ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న వీరి కల కుటుంబ సభ్యుల అడ్డంకుల వల్ల నెరవేరలేదు. రంజిత తల్లిదండ్రులు వీరి ప్రేమను ఒప్పుకోకపోవడంతో ఈ జంట తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోందi. ఈ నేపథ్యంలో వారు ఆటోలో నేను బిగించి ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక సమాచారం. స్థానిక పోలీసులు ఈ ఘటనపై ఆత్మహత్య, హత్య కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమ వివాహాలపై కుటుంబ సామాజిక ఒత్తిడులు యువత జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయన్న చర్చకు ఈ ఘటన దారితీసింది. పోలీసులు మరిన్ని వివరాల కోసం ఈ జంట సన్నిహితులు, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఈ విషాదం యువతలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సమాజంలో అవగాహన, మద్దతు అవసరాన్ని మరోసారి గుర్తు చేసింద.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa