ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీసీపల్లిలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 06, 2025, 06:53 PM

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా, ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రజల్లోకి వెళ్లారు. ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఆయన పీసీపల్లి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు.ఆదివారం జరిగిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి పనుల గురించి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారికి తెలియజేశారు.ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. తల్లికి వందనం, దీపం పథకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, రైతు సంక్షేమం, యువతకు ఉద్యోగాల కల్పన వంటి కీలక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని ఆయన పేర్కొన్నారు. సుపరిపాలన అందిస్తూ కూటమి ప్రభుత్వం తొలి అడుగు పూర్తి చేసుకుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వేమురామయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు యారవ శ్రీనివాసులు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa