ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారి-9పై కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ

national |  Suryaa Desk  | Published : Tue, Jul 08, 2025, 06:58 PM

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గులాబో దేవి కాన్వాయ్ మంగళవారం ప్రమాదానికి గురైంది. ఆమె కాన్వాయ్ ఢిల్లీ నుంచి బిజ్నోర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పిల్ఖువా కొత్వాలి ప్రాంతంలోని జాతీయ రహదారి-9పై కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో గులాబో దేవి ప్రయాణిస్తున్న కారు కూడా ఢీకొట్టింది. గాయాలపాలైన ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భద్రతా సిబ్బంది, ఆమెతో పాటు ఉన్న ఇతర వాహనదారులు కూడా గాయపడినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. ప్రస్తుతానికి మంత్రి పరిస్థితిపై అధికారిక వైద్య బులెటిన్ విడుదల కాలేదు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa