ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫ్ఘనిస్థాన్‌లో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది

international |  Suryaa Desk  | Published : Thu, Jul 10, 2025, 08:53 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రే తన ఆరేళ్ల కూతురిని డబ్బు కోసం 45 ఏళ్ల వ్యక్తికి అమ్మి పెళ్లి జరిపించాడు. ఈ అమానవీయ ఘటన దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లోని మర్జా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మర్జా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పేదరికం కారణంగా తన ఆరేళ్ల కుమార్తెను 45 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇప్పటికే ఇద్దరు భార్యలున్న ఆ వ్యక్తి, బాలిక కుటుంబాన్నికి డబ్బు చెల్లించి ఈ పెళ్లికి ఒప్పించినట్లు అమెరికాకు చెందిన అము.టీవీ అనే మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అవి పెను దుమారం రేపుతున్నాయి. చిన్నారి పక్కన కూర్చున్న మధ్య వయస్కుడైన వరుడిని చూసి నెటిజన్లు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న స్థానిక తాలిబన్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. వారి తీరు మరీ విడ్డూరం వారు ఆ వ్యక్తి, బాలికను తన ఇంటికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే, బాలికకు తొమ్మిదేళ్లు నిండిన తర్వాత భర్త ఇంటికి పంపవచ్చని వారు చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై తాలిబన్ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, బాలిక తండ్రిని, వరుడిని అరెస్ట్ చేసినట్లు హష్త్-ఎ-సుభ్ డైలీ అనే పత్రిక తెలిపింది. ప్రస్తుతం ఆ చిన్నారి తన తల్లిదండ్రుల వద్దే సురక్షితంగా ఉంది.ఆఫ్ఘనిస్థాన్‌లో 2021లో తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి బాల్య వివాహాలు గణనీయంగా పెరిగాయి. తీవ్రమైన పేదరికం, బాలికల విద్యపై ఆంక్షలు ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. గతేడాది ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం, తాలిబన్ల పాలనలో బాల్య వివాహాలు 25% పెరిగాయని, ఇది బాలికల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తోందని మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa