ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను వెంటిలేటర్పై ఉన్న స్థితిలో నుండి ఐసీయూకు తీసుకురాగలిగామని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాముడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ప్రజలకు నమ్మకాన్ని కలిగించే విధంగా "సూపర్ సిక్స్" హామీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు.
ముందు ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినిందని, ముఖ్యంగా వ్యవసాయ శాఖను వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. రైతులకు మద్దతు ధరలు, సబ్సిడీలు, సహాయ పథకాలు అన్నీ ప్రాతినిధ్యంగా మిగిలిపోయాయని ఆరోపించారు. ఇప్పుడు వాటిని పునరుద్ధరించేందుకు నూతన ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
రాష్ట్రాభివృద్ధి కోసం సమగ్ర కార్యాచరణ రూపొందించామని, గ్రామ స్థాయిలోనే ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని నిమ్మల పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పరిపాలనలో పారదర్శకతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa