ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనేక అంశాలపై లోతైనా అవగాహన కలిగిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు

national |  Suryaa Desk  | Published : Sun, Jul 13, 2025, 04:09 PM

కోటా శ్రీనివాసరావు మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. విలక్షణ నటుడు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు కోటా శ్రీనివాస రావు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. వారు అనేక అంశాలపై లోతైనా అవగాహన కలిగిన వ్యక్తి వారితో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని ఉద్ఘాటించారు. సనాతన ధర్మం, సామాజిక విలువలు, భాషా పరిరక్షణ తదితర విషయలపై సమాజంలో మరి ముఖ్యంగా యువతలో చైతన్యం నింపేందుకు ఎంతో కృషి చేశారని తెలిపారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించి తెలుగు సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును చాటుకున్నారని చెప్పకొచ్చారు. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలిపారు. కోట సేవలను గుర్తించి 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించుకుందని ఉద్ఘాటించారు. ఆయన మృతి సినీ రంగానికి తెలుగు సమాజానికి తీరనిలోటని చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa