ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హింసాత్మక చర్యలకి పాల్పడితే సహించేదిలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 13, 2025, 04:43 PM

వైసీపీ రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలు, కుట్రలు కొనసాగిస్తే ప్రజలు ఊరుకోరని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. "వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా బుద్ధి రాలేదు. ప్రజలు వారి దుర్మార్గాలను మరచిపోలేదు. రాష్ట్రంలో వైసీపీ జాడ కూడా లేకుండా పోతుంది," అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించే నాయకుడు చంద్రబాబు అని, టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు."జగన్ లాంటి రాక్షసుడిని ముఖ్యమంత్రిని చేసినందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు. బాధపడుతున్నారు. సభలు పెట్టి నెత్తుటి రాజకీయాలు చేసే వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. పార్టీ సభ పెట్టుకోవాలనుకున్నావ్.. పెట్టుకోవాలి. అంతే గానీ ఆ సభను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో రక్తం పారిస్తానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనుకుంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదా? నరుకుతాం, చంపుతాం, తొక్కుకుంటూ పోతామని రాక్షసుడిలా మాట్లాడిన నాయకుడు నీవే. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి.. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా.. దాడులు, దౌర్జన్యం కేసులు, కుట్రలతో రాష్ట్రంలో అశాంతి రేపావు. అమాయకుల్ని జైళ్లకు పంపారు. నీ అరాచకాన్ని ఇక భరించలేమని తేల్చి 11 సీట్లకు పరిమితం చేశారు. రేపు మీరేమైపోతారో? తెలియదు" అంటూ  కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa