ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభకు నూతన సభ్యులని ఎంపిక చేసిన ద్రౌపది ముర్ము

national |  Suryaa Desk  | Published : Sun, Jul 13, 2025, 04:44 PM

రాజ్యసభకు నలుగురు కొత్త సభ్యులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా నామినేట్ చేశారు. పలువురు సభ్యుల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త సభ్యులను నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాహిత్యం, సైన్స్, కళలు మరియు సామాజిక సేవ వంటి రంగాలలో విశేష సేవలందించిన ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఏ) ద్వారా సంక్రమించిన అధికారంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా లాయర్ ఉజ్వల్‌ నిగమ్‌, సదానందన్‌, హర్షవర్ధన్‌, మీనాక్షి జైన్‌ లను రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa