ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నర్సీపట్నంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న గుడివాడ అమ‌ర్నాథ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 14, 2025, 02:35 PM

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రతీ గ్రామానికి, ప్ర‌తి ఇంటికి తీసుకుని వెళ్ళాల‌ని మాజీమంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ పిలుపునిచ్చారు. ఆదివారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం మాజీ శాసనసభ్యులు నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త  పెట్ల ఉమశంకర్ గణేష్  అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో గుడివాడ అమ‌ర్నాథ్‌, మాజీ విప్, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ కరణం ధర్మ శ్రీ , అనకాపల్లి పార్లమెంట్ ప‌రిశీల‌కురాలు శోభా హైమావతి  , జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ లు, సర్పంచులు, ముఖ్య నాయుకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa