ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. వారందరికీ 100 శాతం అలవెన్స్

business |  Suryaa Desk  | Published : Tue, Jul 15, 2025, 10:44 PM

దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ, టాటా గ్రూప్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తమ ఉద్యోగులు ఎగిరి గంతేసే శుభవార్త చెప్పింది. ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి గానూ ఐటీ ఉద్యోగులకు వేరియబుల్ పే అలవెన్స్ చెల్లింపులపై ప్రకటన చేసింది. తమ కంపెనీలో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం మందికి ఈసారి నూటి నూరు శాతం వేరియబుల్ పే చెల్లింపులు చేయనున్నట్లు వెల్లడించింది. అలాగే తమ వ్యాపార విభాగాల పని తీరు ప్రకారంగా మిగితా ఉద్యోగులకూ గరిష్ఠంగానే వేరియబుల్ పే పేమెంట్లు ఉంటాయని తెలిపింది.


ఇలా ఎక్కువ మంది ఉద్యోగులకు వందుకు వంద శాతం వేరియబుల్ పే చెల్లింపులు చేయడం కంపెనీ చరిత్రలో ఇది వరుసగా రెండోసారిగా టీసీఎస్ పేర్కొంది. అంటే ఈసారి 70 శాతం మంది ఉద్యోగుల ఖాతాల్లో శాలరీతో పాటు వేరియబుల్ పే కలిపి లక్షల రూపాయలు జమ అవుతాయని చెప్పవచ్చు. ' క్వార్టర్లీ వేరియబుల్ పే ప్లాన్ ప్రకారం.. కంపెనీలోని సీ2 గ్రేడ్ వరకు ఉన్న ఉద్యోగులు అందరూ 100 శాతం వేరియబుల్ పే చెల్లింపులు అందుకుంటారు. సీ3 గ్రేడ్, ఆపై స్థాయుల్లో ఉన్న వారికి వారి వారి వ్యాపార విభాగాల పని తీరు ఆధారంగా వేరియబుల్ పేమెంట్లు ఉంటాయి' అని టీసీఎస్ హెచ్ఆర్ విభాగాధిపతి మిలింద్ లక్కడ్ తమ ఉద్యోగులకు పంపించిన ఇ-మెయిల్‌లో వెల్లడించారు.


 టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థలోని ఉద్యోగుల్లో వివిధ గ్రేడ్‌లు ఉంటాయి. వై- లెవెల్ నుంచి అంటే ట్రైనీలతో ఈ గ్రేడింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత సిస్టమ్ ఇంజనీర్లు (C1), c2, c3,c4,c5 అంటూ గ్రేడ్లు ఉంటాయి. సాధారణంగా సీ3, అంతకంటే ఎక్కువ గ్రేడ్లలోని ఉద్యోగుల్లో సీనియర్ మేనేజర్లు, యూనిట్ హెడ్స్ ఉంటారు.


టీసీఎస్ ఇటీవలే వేతనాల పెంపుపైనా ప్రకటన చేసింది. తమ సంస్థలోని 6 లక్షల మంది ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఈ ఆర్థిక సంవత్సరం 2025- 26 ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో అట్రిషన్ రేటు పెరిగిన క్రమంలో వేతనాల పెంపుపై ప్రకటన చేసింది. తమ మొదటి ప్రాధాన్యత ఉద్యోగుల జీతాల పెంపుపైనే ఉంటుందని సీఎఫ్ఓ సమీర్ సెక్సారియా తెలిపారు. చాలా అరుదుగా వేతనాల పెంపు ఆలస్యమవుతుందని, ఈసారి కచ్చితంగా ఉంటుందని తెలిపింది. జీతాలు పెంచడంతో కంపెనీ లాభాల మార్జిన్ 1.50 శాతానికంటే ఎక్కవ తగ్గుతుందని అంచనా వేశారు. ఉద్యోగుల వలసల రేటు ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa