బౌద్ధ సన్యాసులకు వలపు వలవిసిరిన ఓ యువతి.. న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసిన దాదాపు రూ.102 కోట్లు కాజేసింది. వీడియోలు, ఫొటోలు చూపిస్తూ బెదిరించి డబ్బులు దోచేసిన ఈ ఘటన థాయ్లాండ్లో కలకలం రేపుతోంది. ఇటీవల ఓ సన్యాసి సన్యాసం నుంచి వైదొలగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు దీనిపై దృష్టి సారించడంతో హనీట్రాప్ వ్యవహారం బయటపడింది. విల్మాన్ ఎమ్సావత్ అనే యువతి మే 2024లో సన్యాసిని హనీట్రాప్ చేసి.. శారీరక సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధం వల్ల ఒక బిడ్డ పుట్టిందని చెప్పి.. ఖర్చుల కోసం రూ.1.85 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
దర్యాప్తులో ఆమె చాలా మంది సన్యాసులను ఇలాగే మోసం చేసిందని తేలింది. ఆమె దగ్గర 80 వేల ఫొటోలు, వీడియోలు ఉన్నాయని గుర్తించారు. వాటితోనే ఆమె ఈ మోసాలన్నీ నడిపిందని, బ్లాక్ మెయిల్ చేసిన సంపాదించిన డబ్బును బెట్టింగుల్లో పెట్టిందని తెలిపారు. ఈ ఘటనతో థాయ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి కేసులు ఇంకా ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకోడానికి ఒక హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. సన్యాసులను ప్రలోభపెట్టిన ఆ మహిళకు పోలీసులు మిస్ గోల్ఫ్గా పేరుపెట్టారు.
ఎవరీ విలావన్ ఎంసావత్ ?
పోలీసుల కథనం ప్రకారం.. విలావన్ ఎంసావత్ (35) మూడేళ్లలో తొమ్మిది మంది బౌద్ధ సన్యాసులు సహా పలువురు ప్రముఖలతో లైంగిక సంబంధాలు పెట్టుకుని, వాటిని వీడియోలుగా తీసి, డబ్బు కాజేసింది. బీబీసీ నివేదికల ప్రకారం.. మూడేళ్లలో దాదాపు 385 మిలియన్ బాత్ (రూ. 102 కోట్లు) సంపాదించింది. ఉత్తర బ్యాంకా్లోని నాన్థాబురిలోని ఓ విలాసవంతమైన ఇంట్లో ఆమె నివాసం ఉంటోంది. ఆమె ఇంట్లో 80,000కి పైగా ఫోటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇవన్నీ ప్రముఖ సన్యాసులతో లైంగిక చర్యల్లో పాల్గొన్న వీడియోలే కావడం గమనార్హం.
ఆమెతో శరీర సంబంధం పెట్టుకున్నట్టు కొంతమంది సన్యాసులే అంగీకరించారు. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో సన్యాసులకు మెసేజ్లు పంపుతూ ఆమె దగ్గరైంది. ఓ సన్యాసి మాట్లాడుతూ.. ‘‘మా ఇద్దరి మధ్య చాలాకాలంగా సంబంధం ఉంది.. ఆమె నాకు కారు కూడా గిఫ్ట్ ఇచ్చింది. కానీ ఆమెకు ఇంకో సన్యాసితో సంబంధం ఉందని తెలిసింది. అప్పుడే సమస్యలు మొదలయ్యాయి. తరువాత డబ్బు కోసం బెదిరింపులకు దిగింది’’ అన్నారు. కాగా,థాయ్లాండ్ ఆశ్రమాల్లో సన్యాసులు మత్తుకు అలవాటు ఆసుపత్రుల్లో చేరిన ఘటనలు ఉన్నాయి.
పిల్లాడికి తండ్రిగా సన్యాసి?
వట్ త్రి థోట్సథేప్ ఆశ్రమానికి చెందిన ఓ సన్యాసి ఇటీవల కనిపించకుండా పోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. బ్లాక్మెయిల్ భయంతో అతడు సన్యాసాన్ని వదిలి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో విల్మాన్ ఆ సన్యాసి కారణంగా తనకు ఓ బిడ్డ పుట్టాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇప్పటి వరకు తొమ్మిది మందిని సన్యాసం నుంచి బహిష్కరించారు. కొందరు పరారీలో ఉన్నారు. ‘మహిళలు సన్యాసులతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్ట సవరణ చేయాలని థాయ్ సెనేట్ డిమాండ్ చేస్తోంది. అయితే ఇందులో కేవలం మహిళలపై తప్పు నెట్టడం సరికాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
దీనిపై బ్యాంకాక్ పోస్ట్ కాలమిస్ట్ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ‘‘బౌద్ధ ధర్మం ప్రకారం సన్యాసుల ‘పవిత్ర’తకి మహిళలను శత్రువులుగా చిత్రీకరిస్తున్నారు. ఆలయ గోడలపై కూడా మహిళలను పాముల్లా వేయడం చూస్తాం. ఇప్పుడు అయితే, నైతికంగా పతనం చెందిన వారిలో పురుషులే ఉన్నా, ఆ మార్గాన్ని చూపించింది ఒక్క మహిళనే అని ఎత్తిచూపడం అన్యాయం’’ అని మండిపడ్డారు.
థాయిలాండ్లో సుమారు 2 లక్షల మంది బౌద్ధ సన్యాసులు, 85,000 శిష్యులు ఉన్నారు. ఆశ్రమాల్లో లైంగిక, ఆర్థిక కుంభకోణాలు సాధారణమే అయినా, ఈ కేసులో ప్రముఖ సన్యాసులు ఉండటంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa