ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతడికి వాట్సాప్ మెసేజ్ పంపించి,,,మహిళ ఆత్మహత్య

Crime |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 08:45 PM

'నీకు.. నా కన్నా.. నీ భార్యే ముఖ్యమా...? నేను చనిపోతున్నా' అంటూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఈ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మండలానికి చెందిన ఓ మహిళ సత్యవేలు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె ప్రియుడు సత్యవేలు మొబైల్‌కు 'ఈ మధ్య నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు’ అంటూ వాట్సాప్ మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ చూసిన ప్రియుడు కూడా స్టాంగ్‌‌గా రిప్లై ఇచ్చాడు.


'ఎప్పుడూ నీతోనే ఉండాలా..? నేను నా భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాలి' అన్నాడు సత్యవేలు. 'అయితే.. నీకు.. నా కన్నా.. నీ భార్యే ముఖ్యమా...? నేను చనిపోతున్నా' అంటూ ఆమె సీరియస్‌గా మళ్లీ మెసేజ్ పెట్టింది. ఆ వెంటనే ఆమె ప్రాణాలు తీసుకుంది.. అయితే పోలీసులు ఆమె మొబైల్ చూసి ఈ విషయాన్ని గుర్తించారు. మహిళ మరణానికి కారణమైన సత్యవేలుపై చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వారంతా కుప్పం పోలీసుస్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన చేశారు. ఆ తర్వాత కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మహిళ మరణానికి కారణమైన సత్యవేలుపై కేసు నమోదు చేస్తామన్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కన్నతల్లిని కొడుకే చంపేశాడు. రొంపిచెర్ల మండలం మోటమల్లెలకు చెందిన శారద అనే మహిళను 20 ఏళ్ల క్రితం సురేష్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. సురేష్ చిన్నగొట్టిగల్లు మండలం నల్లఓబులవారిపల్లెకు చెందిన వ్యక్తి. ఏడాది క్రితం సురేష్ కువైట్ వెళ్లగా.. శారద ఇద్దరు పిల్లలతో కలిసి తిరుపతి గొల్లవానిగుంటలో అద్దెకు ఉంటోంది. ఆమె ఒక షోరూమ్‌లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోంది. అయితే పెద్ద కుమారుడు ధనుష్‌కుమార్‌ ఇంటర్‌ మధ్యలో ఆపేసి ఖాళీగా ఉన్నాడు. ఈ క్రమంలో తల్లిపై అనుమానం పెంచుకున్న ధనుష్.. మద్యం మత్తులో తల్లితో గొడవపడ్డాడు. ఏదైనా పని చేసి బతకు అంటూ శారద మందలించింది. కోపంతో ధనుష్ తల్లిని కొట్టి.. కిందపడిపోగానే గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయం అమ్మమ్మకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు ధనుష్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa