ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, వారి అభిప్రాయాలు, సలహాలు సేకరిస్తోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 09:04 PM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో, సుపరిపాలనలో తొలి అడుగు పేరిట డోర్ టు డోర్ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, వారి అభిప్రాయాలు, సలహాలు సేకరిస్తోంది. మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షణలో, సాంకేతికత సాయంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. జులై 2న కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరిలో నారా లోకేశ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.గత 18 రోజుల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు 50 లక్షలకు పైగా ఇళ్లను సందర్శించి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 పథకాలు, మెగా డీఎస్సీ, తల్లికి వందనం, అన్న క్యాంటీన్, దీపం 2 వంటి పథకాల గురించి వివరిస్తున్నారు. అంతేకాక, ప్రజల నుంచి విలువైన సలహాలు, అభిప్రాయాలు సేకరిస్తూ, పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఆత్మీయ స్పందన లభిస్తోంది.మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఈ కార్యక్రమం సాంకేతికతతో సమర్థవంతంగా నడుస్తోంది. డ్యాష్‌బోర్డ్ ద్వారా కార్యక్రమ పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. SMS, IVRS వంటి వ్యవస్థల ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ వినూత్న విధానం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఇళ్లను కవర్ చేయగలిగారు. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది.సంక్షేమంతోపాటు అభివృద్ధిని సమన్వయం చేస్తూ, విజన్ 2047తో స్వర్ణాంధ్రప్రదేశ్‌ను నిర్మించే దిశగా టీడీపీ ప్రభుత్వం దూసుకుపోతోంది. ఈ కార్యక్రమం ద్వారా పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, రాబోయే అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ, వారి నమ్మకాన్ని మరింత చేరుకుంటోంది. ప్రతి నియోజకవర్గంలో కరపత్రాల రూపంలో సమాచారాన్ని అందిస్తూ, ప్రజలతో సమగ్ర సంబంధాన్ని ఏర్పరుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa