ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జస్టిస్ యశ్వంత్ వర్మ‌పై మహాభియోగ తీర్మానం,,,,అధికార పార్టీకి మద్దతు ఇచ్చిన విపక్ష కాంగ్రెస్

national |  Suryaa Desk  | Published : Sun, Jul 20, 2025, 06:59 PM

సోమవారం (జులై 21) నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ మహాభియోగ తీర్మానం, ఆపరేషన్ సిందూర్ సహా అనేక అంశాలు కీలకం కానున్నాయి. జస్టిస్ వర్మ తొలగింపునకు మహాభియోగం తీర్మానం తీసుకురానున్నట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఇప్పటికే 100కిపైగా ఎంపీలు తమ మద్దతును తెలియజేస్తూ సంతకాలు చేసినట్టు సమాచారం. మార్చి 14న హోలీ రోజున ఢిల్లీలోని జస్టిస్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భారీగా నోట్ల కట్లు బయటపడటం కలకలం రేపింది. న్యాయవ్యవస్థ అవినీతిలో కూరుకుపోయినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో సుప్రీం కోర్టు తానే స్వయంగా విచారణకు ఆదేశించగా, ముగ్గురు సభ్యుల కమిటీ ఆయనపై మహాభియోగానికి సిఫార్సు చేసింది. అయితే జస్టిస్ వర్మ దీనిని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


భారత రాజ్యాంగం ప్రకారం, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తిని తొలగించడం అనేది రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రమే సాధ్యం. ఇది కూడా మహాభియోగ తీర్మానం ఆధారంగా మాత్రమే జరగాలి. లోక్‌సభలో కనీసం 100 మంది లేదా రాజ్యసభలో 50 మంది సభ్యుల మద్దతుతో మహాభయోగ తీర్మానం ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత మెజార్టీ సభ్యుల మద్దతుతో ఆమోదం పొందాలి. ఆశ్చర్యకరమైన పరిణామం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వబోతున్నట్టు వర్గాలు చెబుతున్నాయి.


లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా 35 మంది కాంగ్రెస్ ఎంపీలు ఈ తీర్మానానికి సంతకం చేశారు. కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ‘‘ ఇది పార్టీలకు అతతీత అంశం.. న్యాయవ్యవస్థలో అవినీతిపై ప్రతి పార్టీకి బాధ్యత ఉంది’ అని అన్నారు.


పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, మణిపూర్ హింస, ట్రంప్ మధ్యవర్తిత్వ వ్యాఖ్యలు, బీహార్ ఓటర్ల జాబితా సమీక్ష వంటి అంశాలపై విపక్షం నిలదీయనుంది. మొత్తం 15 బిల్లులను ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రవేశపెట్టనుంది. వీటిలో పన్నులు, నౌకాశ్రయం, క్రీడా పాలన, జియోహెరిటేజ్ పరిరక్షణ వంటి కీలక బిల్లులు ఉన్నాయి.


కాంగ్రెస్ నేత, ఎంపీ గౌరవ్ గొగోయ్మాట్లాడుతూ.. ‘‘పహల్గామ్ ఘటనపై ప్రధాని స్వయంగా మాట్లాడాలి. విదేశాంగ విధానంపై కూడా ప్రధానమంత్రి స్పష్టత ఇవ్వాలి. మణిపూర్‌ ఇంకా ఎందుకు ఇంకా వెళ్లలేదనే ప్రశ్న కూడా మాకు ఉంది’’ అన్నారు. సుప్రియా సూలే (ఎన్సీపీ) ‘రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మంత్రులు అసెంబ్లీలో రమ్మీ ఆడుతున్నారు. అవినీతిపరులపై చర్యలు తీసుకోండి’ అని విమర్శలు గుప్పించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa