ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులస చేప తెచ్చిన సంతోషం.... గతేడాది రికార్డు ధర.. ఈ సారి కూడా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 20, 2025, 08:08 PM

అదృష్టం అంటే ఎప్పుడో ఒకసారి పలకరిస్తుంది. కానీ ఆ మత్య్యకారుడికి మాత్రం ఏటా ఒకసారి తప్పకుండా పలకరిస్తుందనే చెప్పొచ్చు. యానాం రాజీవ్ బీచ్‍లో శనివారం చేపల వేలం నిర్వహించారు. ఇందులో ఓ పులస చేపకు భారీ ధర పలికింది. కేజీ 800 గ్రాములు బరువు ఉండే పులస చేప రేటు.. ఏకంగా రూ.22 వేలు పలికింది. పొన్నమండ రత్నం అనే మహిళ ఈ పులస చేపను వేలంలో దక్కించుకున్నారు. మల్లాడి ప్రసాద్ అనే మత్స్యకారుడి వలకు ఈ పులస చేప చిక్కింది. గౌతమి గోదావరి నదిలో భైరవపాలెం సమీపంలో ఈ చేప వలలో పడినట్లు ప్రసాద్ తెలిపారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇదే మల్లాడి ప్రసాద్ వలకు గతేడాది కూడా పులస చేప పడింది. అప్పట్లో ఇది రూ.23000కు అమ్ముడైంది. గతేడాది పులస చేప పలికిన అత్యధిక ధర ఇదే కావటం విశేషం. ఈసారి కూడా ప్రసాద్ చేపలో పులస పడగా.. అది కూడా రూ.22000 పలకడం విశేషం.


మరోవైపు పులస చేపలు అత్యంత రుచికరంగా ఉంటాయి. దీంతో మార్కెట్లో వీటికి భారీగా డిమాండ్ ఉంది. మరోవైపు వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో పులస చేపలు సంతానోత్పత్తి కోస బంగాళాఖాతం నుంచి నదిలోకి వస్తున్నాయి. సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో మాత్రమే పులస చేపలు లభిస్తాయి. మరోవైపు ఈ ఏడాది తొలి పులస చేప కూడా యానాం వద్ద గౌతమి గోదావరిలో జాలర్ల వలకు చిక్కింది. ఈ పులస చేపను కూడా పొన్నమాడ రత్నం రూ.15000 లకు కొనుగోలు చేశారు.


జూలై నెల ప్రారంభం కావటం, పులస చేపలు సంతానోత్పత్తి కోసం గోదావరి నదిలోకి వస్తూ ఉండటంతో మత్స్యకారులు సంబరాల్లో మునిగిపోయారు. ఎందుకంటే మిగతా ఎన్ని చేపలు పడినా రానన్ని డబ్బులు.. పులస చేపలు పడితే వస్తాయి. దీంతో పులసల రాక కోసం ఈ ప్రాంతంలో మత్స్యకారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరోవైపు ఆస్టర్ పాచిని తినే పులాసలో ఒమేగా ఆల్గే ఆయిల్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే పునరుత్పత్తి కోసం సముద్రం నుంచి నదిలోకి ప్రయాణించే నాటికి ఈ చేపలు రుచిగా మారుతాయి. మరోవైపు గుడ్లు ఎక్కువగా ఉన్న పులస చేపలు మరింత రుచికరంగా ఉంటాయి. అలాగే ఖరీదైనవి కూడా. అలాంటి వాటి కోసం డిమాండ్ కూడా ఎక్కువే. అయితే గోదావరి నదిలోనే ఎక్కువగా పులస చేపలు దొరుకుతుంటాయి. కృష్ణానదిలో పులస చేపలు పడటం తక్కువనే చెప్పాలి. ఎందుకంటే కృష్ణా నదికి సముద్రం నుంచి వరద నీరు రావటం తక్కువే కారణమని అధికారులు చెప్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa