ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ కార్యకర్త మృతిపై విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 08:55 AM

టీడీపీ కార్యకర్త శేషగిరిరావు గుండెపోటుతో చనిపోగా, అయన మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. శేషగిరిరావు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, అలాంటి నేతను కోల్పోవడం బాధాకరమన్నారు. శేషగిరిరావు పిల్లల చదువు వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి గత ఎన్నికల్లో వీరోచిత పోరాటం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల రోజున వైసీపీ రౌడీల చేతిలో గాయపడినా.. మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లిన శేషగిరిరావు ఒక పోరాట యోధుడు అంటూ అభివర్ణించారు. భౌతికంగా దూరమైనా, పార్టీకీ ఆయన చేసిన సేవలను శ్రేణులు గుర్తుంచుకుంటాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa