ఈమధ్య కాలంలో పెళ్లై భర్త, ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్న మహిళలు కూడా.. తమ పిల్లల వయసున్న వారితో పారిపోతున్నారు. కాబోయే అల్లుళ్లు, కాబోయే వియ్యంకుడు, వారి బంధువులు, ఇతరులతో ప్రేమలో పడిపోతూ.. కుటుంబాలను కాదనుకుని ఇంట్లోంచి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఘటనలు జరగ్గా.. తాజాగా అలాంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది. ముఖ్యంగా పెళ్లి అయి పాతికేళ్లు అవుతుండగా.. నలుగురు పిల్లలు కూడా ఉన్న ఓ తల్లి.. తన పిల్లల వయుసున్న మేనల్లుడితో ప్రేమలో పడింది. అది చాలదన్నట్లుగా కుటుంబ సభ్యులు అందరినీ వదిలేసి అతడితో పారిపోయింది. ఇక్కడితో కథ అయిపోలేదు. ఇక్కడే మొదలైంది.
ఉత్తర ప్రదేశ్లోని సిద్దార్థ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళకు 25 ఏళ్ల క్రితమే పెళ్లి అయింది. భర్తతో పాటు ఆమెకు నలుగులు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు ఆడ పిల్లలు కాగా.. మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో పెద్ద కుమార్తె వయసు 20 ఏళ్లు కాగా, రెండో అమ్మాయికి 18 ఏళ్లు. ఇక మూడో అబ్బాయికి 17 సంవత్సరాల వయసు కాగా నాలుగో అబ్బాయికి 10 ఏళ్లు. భార్యా పిల్లల పోషణ కోసం ఇంటి పెద్ద అయిన భర్త తీవ్రంగా కష్ట పడుతున్నాడు. ఇంటికి దూరంగా ఉంటూ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని సాకుతున్నాడు.
అయితే పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఉండే మహిళ వద్దకు.. ఆమె మేనల్లుడు వచ్చేవాడు. బంధువు.. అందులోనూ మేనల్లుడు కావడంతో తరచుగా ఇంటికి చేరుకునేవాడు. తన పిల్లల వయసున్న వాడే కావడంతో అందరూ అతడిని సాదరంగా ఆహ్వానించేవారు. ఈక్రమంలోనే మేనల్లుడిపై ఆ అత్తకు ప్రేమ పుట్టింది. అతడికీ ఆమెపై ప్రేమ ఉండగా.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో శారీరకంగా కలిసేవాళ్లు. ఇలా చాలా రోజులుగా చాటుమాటుగా వ్యవహారం సాగిస్తున్నారు. అయితే ఇదంతా కష్టం అవుతుండడంతో.. ఇంట్లోంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఏడాది క్రితం ఓరోజు ఇద్దరూ కలిసి వెళ్లిపోయారు.
కోర్టులో వివాహం కూడా చేసుకున్నారు. తల్లి వయసున్న మహిళను పెళ్లి చేసుకోగా అంతా ఆశ్చర్చపోయారు. ఎవరేమనుకున్న తనకు అత్తే కావాలని అతడు, భర్త వద్దు మేనల్లుడితోనే ఉంటానని మహిళ తెగేసి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు కూడా వీరిద్దరినీ వదిలేశారు. ఆపై ఆరు నెలల పాటు వీరిద్దరూ సంతోషంగా గడిపారు. కానీ కాలం గడుస్తున్నా కొద్దీ గొడవలు ప్రారంభం అయ్యాయి. దీంతో తట్టుకోలేకపోయిన మహిళ మళ్లీ భర్త వద్దకు వచ్చేసింది. పిల్లలను చూసుకుంటూనే జీవిస్తానని చెప్పగా.. పెద్ద మనసు చేసుకున్న అతడు ఇంట్లోకి ఆహ్వానించాడు. ఇదే సమయంలో.. మేనల్లుడు కూడా తాను ఇక ఆమెతో ఉండలేనని పోలీసులకు స్పష్టం చేశాడు. ఈ పరిణామాలతో అంతా సద్దుమణిగిందనుకున్నారు.
ఆరు నెలలు వీరిద్దరూ ఎవరి ఇళ్లలో వారు చక్కగానే ఉన్నారు. కానీ ఆ తర్వాతే ఓ ఊహించని మలుపు చోటు చేసుకుంది. ముఖ్యంగా మళ్లీ మహిళ తన మేనల్లుడి వద్దకు వెళ్లిపోయింది. ఇలా ఈ విషయం గ్రామ పంచాయతీ కోసం పెద్దల వద్దకు చేరింది. ఈ సందర్భంగానే.. ఆ మహిళ ఎటువంటి సంకోచం లేకుండా.. తాను తన మేనల్లుడితోనే కలిసి జీవించాలనుకుంటున్నానని, భర్త వద్దకు తిరిగి వెళ్లడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేసింది. ఆమె దృఢమైన నిర్ణయం విన్న తర్వాత.. భర్త కూడా తీవ్ర వేదనతో ఆమె కోరికను అంగీకరించక తప్పలేదు. తన భార్యను ఆమె ప్రియుడితోనే వెళ్లిపోవడానికి అంగీకరించినట్లు మీడియాకు తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa