ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దెయ్యాలు పీడిస్తున్నాయని జ్యోతిషుడి వద్దకు వృద్ధురాలు,,,భారతీయ జ్యోతిషుడ్ని పట్టించిన బ్యాంకర్లు

international |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 10:52 PM

అమెరికాలో ఒక విచిత్రమైన మోసం బయటపడింది. భారతీయ సంతతికి చెందిన ఒక జ్యోతిష్యుడు దెయ్యాలు, భూతాలను తరిమేస్తానని చెప్పి ఒక వృద్ధురాలి వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేయబోయి.. కటకటాల్లోకి వెళ్లాడు. బ్యాంక్ వాళ్లు ఎంట్రీతో అతడి మోసం బయటపడి అడ్డంగా దొరికిపోయాడు వివరాల్లోకి వెళ్తే.. హేమంత్ కుమార్ మునియప్ప (33) అనే జ్యోతిష్యుడు న్యూయార్క్‌లో నివసిస్తున్నాడు. సౌత్ బ్రాడ్ వేలో 'అంజన జీ' అనే సైకిక్, ఆస్ట్రాలజీ బిజినెస్ నడుపుతున్నాడు. ఈయన దగ్గరికి 68 ఏళ్ల ఒక వృద్ధురాలు వచ్చింది. ఆమెకు దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయని గట్టిగా నమ్ముతుంది..


ఆమె నమ్మకాన్ని మనమొందుకు వద్దానాలని.. రెండెక్కువ కలిపి నిజంగానే దెయ్యాలున్నాయని చెప్పాడు మునియప్ప .. పైగా వాటిని నేను చిటికెలా తరిమేస్తాను అని హామీ ఇచ్చాడు.. కాకపోతే దెయ్యాలు నీ నుంచి వేరే చోటికి వెళ్లాలంటే.. వాటికి దారి ఖర్చులు ఇవ్వాలని, వాటిని తరిమేయాలంటే డబ్బులు కావాలని చెప్పాడు. ఈయన మాటలు గుడ్డిగా నమ్మిన ఆ వృద్ధురాలు ఇప్పటికే 20,000 డాలర్లు (సుమారు రూ. 16.5 లక్షలు) ఇచ్చేసింది.. అయినా దెయ్యాలకు సరిపోలేదమో, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని మునెప్ప డిమాండ్ చేశాడు.


ఈ క్రమంలోనే ఆ వృద్ధురాలు మరో 42,000 డాలర్లు (సుమారు రూ. 35 లక్షలు) డ్రా చేయడానికి బ్యాంక్‌కి వెళ్లింది. అంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి తీయడానికి ఆమె పడుతున్న కంగారు, చెప్పిన కారణం చూసి బ్యాంక్ సిబ్బందికి అనుమానం వచ్చింది. ఏదో మోసం జరుగుతోందని భావించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చేసరికి ఆ వృద్ధురాలితో పాటే బ్యాంక్‌లో ఉన్న మునియప్ప పట్టుబడ్డాడు. ఎలాంటి గొడవ లేకుండానే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.


దెయ్యాలు వదిలిస్తానని.. రూ.50 లక్షలకు స్కెచ్ వేసి దొరికేసిన జ్యోతిషుడు


పోలీసులు విచారించగా, "నేను కొన్ని హస్తసాముద్రికం, జ్యోతిష్య రీడింగ్‌లు చేశాను. ఆమె నాకు చాలా డబ్బులు... అన్నీ 100 డాలర్ల నోట్లే ఇచ్చింది" అని మునెప్ప ప్రాసిక్యూటర్లకు లిఖితపూర్వకంగా చెప్పి. తప్పు ఒప్పుకున్నాడు. అయితే, శుక్రవారం జరిగిన కోర్టు విచారణలో అతను తన తప్పును ఒప్పుకోలేదు (ప్లీడెడ్ నాట్ గిల్టీ). బెయిల్ లేకుండానే విడుదలయ్యాడు, కానీ అతనికి ఎలక్ట్రానిక్ యాంకిల్ మానిటర్ (కాలికి ట్రాకర్) పెట్టారు, బాధితురాలికి దూరంగా ఉండాలని ఆదేశించారు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన మునెప్ప, ఆరోపణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని NBC4 చెప్పింది.


నిజానికి, న్యూయార్క్ రాష్ట్ర చట్టం ప్రకారం, జ్యోతిష్యం చెప్పి డబ్బులు తీసుకోవడం చట్టవిరుద్ధం. కేవలం వినోదం కోసమైతే తప్పా, భవిష్యత్తు చెబుతామని, చేతబడి, దెయ్యాలను తరిమేస్తామని డబ్బులు వసూలు చేస్తే అది క్లాస్ బి-మిస్‌డెమీనర్ కిందకు వస్తుంది. అలాంటి వాళ్లకు శిక్ష పడుతుంది. ఈ ఘటన చూస్తుంటే.. ఎవరిని పడితే వాళ్లను నమే అమాయకులుంటే.. వారి మదిలో పుట్టే చిన్న అనుమానాన్ని.. మాయమాటలతో పెద్ద పెనుభూతంగా చూపించి మోసం చేసేవాళ్లు ఎలా రెచ్చిపోతారో అర్థం చేసుకోవచ్చు!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa