ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ మాఫియాకు షాక్‌గొలిపే గణాంకాలు: దేశం నష్టపోయిన రూ.22,845 కోట్లు

Crime |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 11:50 PM

సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. మరోవైపు కొత్త పంథాలో సైబర్‌ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. అలా గతేడాది (2024) కాలంలో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి రూ.22,845.73 కోట్లను సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం దాదాపు 206 శాతం పెరిగింది.‘‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP), సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) ప్రకారం.. దేశవ్యాప్తంగా 2024లో సైబర్ మోసాల కారణంగా ప్రజలు రూ.22,845.73 కోట్లు నష్టపోయారు. 2023లో ఈ నష్టం రూ.7,465.18 కోట్లుగా ఉంది’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. సైబర్‌ నేరాలకు సంబంధించి 2022లో 10,29,026  కేసులు, 2023లో 15,96,493, 2024లో 22,68,346 కేసులు నమోదయ్యాయని కేంద్రమంత్రి తెలిపారు.ఆర్థిక మోసాలను వెంటనే నివేదించడానికి, సైబర్‌ నేరాలను అరికట్టడానికి 2021లో సెక్షన్‌ ఐ4సీ కింద CFCFRMSను ప్రారంభించినట్లు బండి సంజయ్‌  తెలిపారు. ఇప్పటివరకు 17.82 లక్షలకు పైగా ఫిర్యాదులు అందగా.. రూ.5,489 కోట్లకు పైగా మొత్తాన్ని రికవర్ చేసినట్టు తెలిపారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నమోదైన కేసులను ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేసి, ఛార్జిషీట్లు   వేయడం, అరెస్టులు, అనంతర చర్యలు తీసుకోవడం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు శాఖల పరిధిలోకి వస్తాయని మంత్రి స్పష్టంచేశారు.సైబర్ నేరాలకు సంబంధించి ఇప్పటివరకు 9.42 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 2,63,348 ఐఎమ్‌ఈఐ(EMEI)లను కేంద్రం బ్లాక్ చేసిందన్నారు. సైబర్‌ నేరగాళ్లను గుర్తించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో గతేడాది సెప్టెంబరు 10న సస్పెక్ట్‌ రిజిస్ట్రీని ప్రారంభించినట్లు మంత్రి గుర్తు చేశారు.ఇక నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP), సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) ప్రకారం.. దేశవ్యాప్తంగా 2023లో సైబర్ మోసాల కారణంగా ప్రజలు రూ.7,465.18 కోట్లు నష్టపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa