దేశంలో ప్రముఖ మెట్రో నగరాల్లో బెంగళూరు ఒకటి. ఐటీ కంపెనీల పెద్ద సంఖ్యలో కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో ఈ నగరం రోజూ రద్దీగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు నివాసితులకు ఒక శుభవార్త అందుతోంది.
బెంగళూర్లోని నమ్మ మెట్రో ‘‘ఎల్లో లైన్’’ త్వరలో ప్రారంభంకాబోతోంది. రాష్ట్రీయ విద్యాలయ రోడ్ (RV రోడ్), బొమ్మసంద్రను కలిపే ఈ మెట్రో లైన్ తుది భద్రతా తనిఖీలు చేస్తు్న్నారు. జూలై 22 నుండి జూలై 25 వరకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (CMRS) ఈ భద్రతా తనిఖీని నిర్వహిస్తారు. ఎల్లో లైన్ మొత్తం పొడవు దాదాపుగా 18.82 కిలోమీటర్లు ఉంటుంది.బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ వచ్చే నెల ఆగస్టులో ఈ లైను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. తొలుత ఈ లైన్ లో మూడు రైళ్లు నడుస్తాయని.. అనంతరం రద్దీ దృష్ట్యా రైళ్లు పెరుగుతాయని తెలిపింది. బెంగళూరులో కనెక్టివిటీ మరింత పెంచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, గ్రీన్-పింక్ లైన్స్ డైరెక్ట్ ఇంటర్ చేంజ్ను అందించడం ఎల్లో లైన్ ముఖ్య ఉద్దేశమని మెట్రో సంస్థ పేర్కొంది. నగరంలోని ఇన్ఫోసిస్, బయోకాన్ వంటి ఐటీ సంస్థలకు నిలయంగా ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ మీదుగా ఎల్లో లైన్ వెళుతుందని తెలిపింది.
ఎల్లో లైన్ స్టేషన్ల వివరాలు:
* RV రోడ్: ఇది గ్రీన్ లైన్తో ఇంటర్చేంజ్
* రాగిగుడ్డ
* జయదేవ హాస్పిటల్: ఇది పింక్ లైన్తో భవిష్యత్తులో ఇంటర్చేంజ్ అవుతుంది
* BTM లేఅవుట్
* సెంట్రల్ సిల్క్ బోర్డ్: ప్రయాణికులు భవిష్యత్తులో బ్లూ లైన్తో ఇంటర్చేంజ్ చేసుకోగలరు.
* బొమ్మనహళ్లి
* హొంగసంద్ర
* కుడ్లు గేట్
* సింగసంద్ర
* హోసా రోడ్
* బెరటేన అగ్రహార
* ఎలక్ట్రానిక్ సిటీ
* కోనప్పన అగ్రహార
* హుస్కూర్ రోడ్
* హెబ్బగోడి
* బొమ్మసాంద్ర (టెర్మినల్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa