ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2026 జనవరి నాటికి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వ్యాలీ ఏర్పాటు చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 23, 2025, 01:07 PM

సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ రివల్యూషన్‌తో పరిస్థితి మారిందని తెలిపారు. ఏడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్‌ అని కొనియాడారు. సరికొత్త ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమని నొక్కిచెప్పారు. వికసిత్‌ భారత్‌తో 2047 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతోందని వ్యాఖ్యానించారు. ఏపీలో 2026 జనవరి నాటికి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యూఏఈ అభివృద్ధిలో భారత్‌ భాగస్వామ్యం హర్షణీయమని అన్నారు. దుబాయ్‌ను చూస్తుంటే తనకు అసూయ వేస్తోందని పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa