ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రికవరి సొమ్ముతో పరారైన ఇద్దరు పోలీసులు

national |  Suryaa Desk  | Published : Wed, Jul 23, 2025, 01:21 PM

చట్టాన్ని రక్షించాల్సిన వారే మోసానికి పాల్పడితే? అటువంటి సంచలన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న అంకుర్ మాలిక్, నేహా పునియా సైబర్ నేరగాళ్ల నుంచి రికవర్ చేసిన రూ. 2 కోట్ల సొమ్ముతో పరారయ్యారు. తీవ్ర గాలింపు అనంతరం ఇండోర్‌లో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆ ఘటన పోలీసు వర్గాల్లోనే కాకుండా, సాధారణ ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది.ఢిల్లీ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా ఉన్న అంకుర్ మాలిక్ పలు సైబర్ కేసులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాడు. బాధితుల నుంచి రికవరీ చేసిన డబ్బును వారికి అందించకుండా ఒక పక్కా పథకం ప్రకారం వ్యవహరించాడు. నకిలీ ఫిర్యాదుదారుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి, ఈ ఖాతాలకు రూ. 2 కోట్లను మళ్లించాడు. ఆ తర్వాత తెలివిగా ఏడు రోజుల సెలవు తీసుకుని అదృశ్యమయ్యాడు. ఆశ్చర్యకరంగా, అదే సమయంలో అతని బ్యాచ్‌కు చెందిన మహిళా ఎస్సై నేహా పునియా కూడా కనిపించకుండా పోయింది.వీరి అదృశ్యంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. 2021లో శిక్షణ సమయంలో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడిందని, అప్పటి నుంచే రికవరీ సొమ్ముతో పరారయ్యే పథకం రూపొందించుకున్నారని తేలింది. డబ్బు చేతికి రాగానే ఈ జంట తమ తమ భాగస్వాములను విడిచిపెట్టి, మొదట గోవా, ఆపై మనాలి, కశ్మీర్ వంటి పర్యాటక ప్రాంతాలలో విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. పోలీసులు వీరి ఆచూకీ కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు, సాంకేతిక ఆధారాలు, నిఘా ద్వారా వీరిని ఇండోర్‌లో గుర్తించి అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి రూ. కోటికి పైగా విలువైన బంగారం, రూ. 12 లక్షల నగదు, 11 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు బదిలీకి సహకరించిన మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa