కృష్ణా జిల్లా ఉయ్యూరులో దొంగతనం ఆరోపణలతో గిరిజన మహిళపై దారుణ దాడి జరిగింది. బంగారం వ్యాపారి చిట్టూరి జగదీశ్వర్ శంకర్ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఆమెపై దొంగతనం నేరం మోపి, వివస్త్రను చేసి కొట్టినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటన ఈ నెల 17న జరిగినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ దాడి గిరిజన సంఘాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. మంగళవారం ప్రజాసంఘాలు ఉయ్యూరులో నిరసన కార్యక్రమాలు చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గిరిజన మహిళలపై జరిగే ఇటువంటి దాడులు సమాజంలో ఇంకా నెలకొని ఉన్న అసమానతలను, అన్యాయాలను బహిర్గతం చేస్తున్నాయి. న్యాయం కోసం బాధితురాలికి మద్దతుగా ప్రజాసంఘాలు, స్థానికులు ఐక్యంగా నిలిచి, నిందితులకు శిక్ష పడేలా ఒత్తిడి తెస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa