ఇంగ్లాండ్తో మాంచెస్టర్లో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో భారత్.. 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు.. 264/4తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. మరో 94 పరుగులు చేసి మిగతా.. ఆరు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ .. ఐదు వికెట్లతో సత్తాచాటాడు. భారత బ్యాటర్లలో సాయి సుదర్శన్ (61) టాప్ స్కోరర్.
ఓవర్ నైట్ స్కోరుకు మరో పరుగు మాత్రమే జోడించి.. రవీంద్ర జడేజా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చాడు. శార్దూల్ ఠాకూర్ (41), వాషింగ్టన్ సుందర్ (27)లు కలిసి ఆరో వికెట్కు 38 పరుగులు జోడించారు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ క్యాచ్ ఔట్ అయ్యాడు.
ఒక్కగానొక్క బ్యాటర్ ఔట్ కావడంతో టీమిండియా త్వరగానే ఆలౌట్ అవుతుందని అంతా భావించారు. కానీ తొలి రోజు గాయంతో పాదం సైతం కిందపెట్టలేకపోయిన పంత్.. జట్టు ఇబ్బందులో ఉందని ఈసారి తిరిగి బ్యాట్ పడ్డాడు. కుంటుతూనే.. క్రీజులోకి వచ్చాడు. విలువైన రన్స్ స్కోరు చేశాడు. అయితే వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కాంబోజ్ (0) త్వరగానే ఔట్ కావడంతో రిషభ్ పంత్ .. వేగంగా బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. క్రీజులో ఉన్నంత సేపు అసౌకర్యంగా కనిపించిన పంత్.. చివరకు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. 54 రన్స్ స్కోరు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక, రిషబ్ పంత్కు ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినా.. ఆయన బ్యాటింగ్కు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్.. ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి రోజు ఆటలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన జోఫ్రా ఆర్చర్.. రెండో రోజు మాత్రం మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచులో ముగ్గురు టీమిండియా బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. యశస్వి జైశ్వాల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్ హాఫ్ సెంచరీలు చేశారు. కేఎల్ రాహుల్ (46),శార్దూల్ ఠాకూర్ (41) రన్స్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa