లార్డ్స్ టెస్టు తర్వాత అందరి దృష్టి శుభమన్ గిల్పైనే పడింది. లార్డ్స్లో మూడో రోజు ఆఖరి ఓవర్లో జరిగిన హై డ్రామా ఎవ్వరూ మరచిపోలేనిది. టెంపర్ కోల్పోయిన శుభమన్ గిల్ ఇంగ్లిష్ బ్యాటర్ జాక్ క్రాలీపై మాటల యుద్ధం మొదలుపెట్టాడు. మొదటి రెండు టెస్టుల్లో తన బ్యాటింగ్తో ఆకట్టుకున్న గిల్.. మూడో టెస్టు నుంచి ఫామ్ కోల్పోయినట్టు కనిపించింది. కీలకమైన మాంచెస్టర్ టెస్టులో కూడా కేవలం 12 పరుగులకే పెవిలియన్ బాట పట్టడంతో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు గిల్ను విలన్తో పోల్చాడు.
రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ చేపట్టిన 25 ఏళ్ల శుభమన్ గిల్ అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో తన పేరు గుర్తుండిపోయేలా చేస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీతో ఈ సిరీస్లోనే టాప్ స్కోరర్గా నిలిచిన పంత్.. బ్యాటర్గానే కాకుండా కెప్టెన్గానూ రాణించాడు. లార్డ్స్ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 16, రెండో ఇన్నింగ్స్లో 6 పరుగులకు అవుటయ్యాడు.
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో బెన్ స్టోక్స్ బౌలింగ్లో వికెట్ల వైపు వస్తున్న బంతిని వదిలేయడంతో ఎల్బీ డబ్ల్యూ అయ్యాడు. ఓపెనర్లతో పాటు సాయి సుదర్శన్ కూడా రాణించినప్పటికీ గిల్ మాత్రం 12 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. గిల్ ఫామ్పై భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ , ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ జొనాథన్ ట్రాట్ కామెంట్స్ చేశారు.
"లార్డ్స్ టెస్టు మూడో రోజు జరిగిన సంఘటన తర్వాత గిల్లో కొంత తడబాటు వచ్చిందని అనిపిస్తోంది. ఒక అఫెన్సివ్ షాట్ ఆడిన తర్వాత ఒక మంచి బంతి లోపలికి వచ్చింది. కానీ మొదటి రెండు టెస్టుల్లో భారీ స్కోర్స్ చేశాడు. లార్డ్స్లో జరిగిన ఇన్సిడెంట్కి ఈ రోజు అవుట్కి లింక్ ఉండదని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు గిల్ భారీ స్కోర్స్ చేయడం మానేశాడు. దీన్ని ఒక లాంగ్ స్లంప్ అనలేం కానీ.. తడబడుతున్నాడు అనిపిస్తోంది. మూడో రోజు తర్వాత ఏదో మారిపోయింది. భారత్లో అతను సూపర్ స్టార్. ప్రపంచం అతని పాదాల దగ్గరే ఉంది అనిపించేలోపే అంతా మారిపోయింది" అని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.
"మూడో రోజు జరిగిన సంఘటన తర్వాత గిల్కి బ్యాటర్ అన్న ట్యాగ్ కంటే విలన్ అన్న ముద్ర ఎక్కువగా వచ్చింది. బ్యాటింగ్ కంటే కెప్టెన్సీపైనే దృష్టి వెళ్లింది. ఈ రోజు మ్యాచ్లో గిల్కు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ కూడా అతని వ్యవహార శైలి కారణంగానే. మొదటి రెండు టెస్టులు గిల్ బ్యాటింగ్ చుట్టూనే సాగాయి. కానీ ఇప్పుడు అతను టార్గెట్ అయ్యాడు. గిల్ ఈ వ్యతిరేకత నుంచి ఎంత త్వరగా కోలుకుంటాడో చూడాలి" అని ట్రాట్ అన్నాడు.
నాలుగో టెస్టు విషయానికి వస్తే టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్కి వచ్చిన భారత జట్టుకు ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. రాహుల్ 46, జైస్వాల్ 58 పరుగులు చేయగా.. సాయి సుదర్శన్ 61 పరుగులతో రాణించాడు. కెప్టెన్ గిల్ 12 పరుగులకు అవుటవ్వగా.. 37 పరుగులు చేసిన రిషబ్ పంత్ కాలికి దెబ్బ తగలడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా (19), శార్దూల్ ఠాకూర్ (19) ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa